హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వికారాబాద్ జిల్లా అభివృద్ధిపై జరిగిన సమీక్షలో మంత్రి మహేందర్ రెడ్డి, కలెక్టర్ దివ్య, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ, ఆర్అండ్బీ పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. సీఎం కేసీఆర్ నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ఇంటింటికి మంచి నీరు సరఫరా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్అండ్బీ పనుల్లోనూ నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే వేటు తప్పదని మంత్రి స్పష్టం చేశారు.