హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ వెలువడింది. టీఎస్పీఎస్సీ శనివారం 8,792 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 5415 ఎస్జీటీలకు, 1941 స్కూల్ అసిస్టెంట్లకు, 1011 లాంగ్వేజ్ పండిట్లకు, 416 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 9 ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎస్ఏ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 31 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 2018, ఫిబ్రవరి సెకండ్ వీక్లో పరీక్షను నిర్వహించనున్నారు.