వరంగల్ రూరల్: రేపు వరంగల్ రూరల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రేపు మ.2.20 గంటలకు ప్రగతి భవన్ నుంచి సీఎం బయలుదేరనున్నారు. మ.2.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. మ.2.30 గంటలకు హెలికాప్టర్లో వరంగల్ రూరల్ జిల్లాకు బయలుదేరుతారు. మ.3.30 గంటలకు గీసుకొండ మండలం శాయంపేట గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం కాజిపేట్ ఆర్వోబీకి సీఎం శంకుస్థాపన చేస్తారు.