భద్రాచలం: నేడు కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు వేకువజామునుంచే గోదావరిలో పుణ్యస్నానమాచరిస్తున్నారు. గోదావరికి దీపారాధన చేసిన అనంతరం హారతులు ఇస్తున్నారు. గౌరీ దేవి నామాలు పఠించి వాయినాలను ఇచ్చిపుచ్చుకున్న తర్వాత తులసీమాతకు ప్రత్యేక పూజలు చేశారు.