ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్‌భవన్ సిబ్బంది నివాస గృహాలు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 05, 2017, 10:39 AM

హైదరాబాద్ : రాజ్‌భవన్ ఆవరణలో కొత్తగా నిర్మించిన 150 స్టాఫ్ క్వార్టర్లను గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఈ ఉదయం ప్రారంభించారు. గవర్నర్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, మేయర్ బొంతు రామ్మెహన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ, ఆదేశాల మేరకు ఏడాదిలోనే సకల హంగులతో రాజ్‌భవన్ స్టాఫ్ క్వార్టర్లు సిద్ధమయ్యాయి. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa