హైదరాబాద్: తెలంగాణ విద్యుత్శాఖ పనితీరువల్ల రాష్ట్రానికి ఎంతో మంచిపేరు వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాగా, ఇవాళ సీఎం కేసీఆర్ విద్యుత్శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్సరఫరా అంశంపై వీరు చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడంలో సంస్థలు మెరుగైన సేవలు అందిస్తున్నాయన్నారు. నాణ్యమైన విద్య నిరంతర విద్యుత్ అందించేందుకు విద్యుత్ సంస్థలు కృషి చేస్తున్నాయని, ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలో మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నాయని చెప్పారు. ఈ స్ఫూర్తిని ఇలానే కొనసాగించి నాణ్యమైన విద్యుత్ అందించాలని విద్యుత్ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.