భారత్కు తిరిగి రప్పించే కేసులో ప్రీ ట్రయల్ హియరింగ్కు విజయ్ మల్యా సోమవారం కోర్టులో హాజరయ్యారు. స్కాట్లండ్ యార్డు పోలీసులు భారత్కు పంపించే కేసులో విజయ్ మల్యాను అరెస్టు చేయగా, ఆ వెంటనే ఆయన బెయిల్ పొందారు. ఐతే కోర్టుకు హాజరు కానక్కర్లేదని ఇంతకు ముందు ఆయనకు మినహాయింపునిచ్చారు. భారత్కు తిప్పి పంపే కేసు విచారణ డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. తానే తప్పూ చేయలేదని, సమర్పించిన సాక్ష్యాలే అందుకు మద్దతు పలుకుతాయని విజయ్ మల్యా మళ్లిd మళ్లిd చెబుతున్నారు. మల్యాకు వ్యతిరేకంగా భారత్ ప్రభుత్వం తరఫున యుకె క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపిఎస్) వాదిస్తోంది. మోసానికి సంబంధించి, అంతకు ముందు సమర్పించిన సాక్ష్యాలకు తోడు ఇప్పడు మనీలాండరింగ్కు సంబంధించిన అదనపు ఛార్జ్లను అక్టోబర్ 3 నాడు విచారణప్పుడు సీపిఎస్ దాఖలు చేసింది. భారత్లోని వివిధ బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా బకాయిపడిన మల్యా నేతృత్వంలోని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు సంబంధించిన మోసం కేసు దాఖలయింది. భారత్లో విచారణ, దర్యాప్తుల నుంచి తప్పించు కునేందుకు విజయ్ మల్యా మార్చి నెలలోనే యుకె వెళ్లిపోయారు. ఆయనను భారత్కు తిరిగి రప్పించే కేసుకు సంబంధించిన పత్రాలను సాంకేతికంగా మళ్లిd దాఖలు చేస్తున్నట్లు సీపిఎస్ తెలిపింది. పాత కేసును కొనసాగిస్తూనే, కొత్త కేసు విచారణకు అనుమతిస్తున్నట్లు జడ్జి, చీఫ్ మెజిస్ట్రేట్ ఎమ్మా లూయీస్ అర్బత్నాట్ చెప్పారు. డిసెంబర్ 4 న ప్రారంభమయ్యే విచారణ, ఆ నెల 14 దాకా కొనసాగనుంది. భారత్కు తిప్పి పంపాలనే తీర్పు వెలువడితే, యుకె హోమ్ సెక్రటరీ రెండు నెలల్లోగా విజయ్ మల్యాను వెనక్కి పంపిచాల్సి వుంటుంది. కాకపోతే తీర్పు మీద అప్పీల్ చేసుకునే వెసులుబాటు వుండటంతో, వెంటనే తేలకపోవచ్చు. నేరస్తులను
తిప్పి పంపించేందుకు భారత్, యుకెలు 1992లోనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇప్పటిదాకా ఒక్కరినే ఆ విధంగా యుకె నుంచి తిప్పి పంపారు. భారత్కు తిప్పి పంపాలనే మరో రెండు కేసులలోనే దీర్ఘకాల విచారణ ఎదుర్కొంటున్న మరో ముగ్గురు భారతీయులు సంజీవ్ కుమార్ చావ్లా, జతిందర్, ఆయన భార్య ఆషా రాణి అంగురాల కేసుల్లో జడ్జి అర్బత్నాట్, రెబెక్కా క్రేన్లు వారికి అనుకూలంగా తీర్పునిచ్చారు.