మహబూబాబాద్: టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. వేరే పార్టీల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సమక్షంలో కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.