పసుపు బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర ఎంపీలమంతా కృషి చేస్తున్నామని ఎంపీ కవిత అన్నారు. జిల్లా కలెక్టరేట్లో భూరికార్డుల ప్రక్షాళనపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి పోచారం, ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కవిత.. పుసుపు బోర్డు ఏర్పాటు, పసుపుకు మద్దతు ధర నిర్ణయించాలనే ముందడుగు.. యోగా గురువు బాబా రాందేవ్ ప్రధానికి లేఖ రాయడంతో పడిందన్నారు.
పసుపును సాధారణ పంటగా కాకుండా కమర్షియల్ పంటగా గుర్తిస్తున్నారన్నారు. దీంతో పంటపై పరిశోధన జరగకపోవడం... మద్దతు ధర కల్పించడం లేదన్నారు. పసుపు రైతుల సమస్యలు పసుపు బోర్డు ద్వారానే పరిష్కారం అవుతాయన్నారు. బోర్డు ఏర్పాటుకు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టినమన్నారు. కేరళ, అసోం, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రధానికి లేఖ రాశారన్నారు. హరిద్వార్లో తాను రాందేవ్ బాబాను కలిశానని.. రాందేవ్ బాబా సానుకూలంగా స్పందించి ప్రధానికి లేఖ రాశారన్నారు. స్పైసీస్ బోర్డు ద్వారా నిజామాబాద్లో ఒక అధికారిని నియమించారన్నారు.