హైదరాబాద్: ఔటర్రింగ్ రోడ్డు రాజధానికి మణిహారమని సీఎం ఓస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. ఔటర్ ప్రయాణం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆశయమని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పచ్చదనంపై ఉన్నతాధికారులతో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సమీక్ష నిర్వహించారు. జీఈఎస్ సదస్సుకు వచ్చే ప్రతినిధులు మెచ్చేలా ఔటర్ ఉండాలని హెచ్ఎండీఏ అధికారులకు నిర్దేశించారు. మొక్కలకు నీటి సౌకర్యం కొనసాగాలి. చనిపోయిన మొక్కల స్థానంలో పెద్ద మొక్కలు వెంటనే నాటాలి. పచ్చదనంపై ప్రేమ, నిబద్ధత ఉన్నవాళ్లే చెట్లను కాపాడగలరు. మొక్కల రక్షణ విషయంలో ఉదాసీనతను సహించేది లేదన్నారు. ఔటర్-సర్వీస్ రోడ్డు మధ్య స్థలంలో రావి, చేప, మర్రి చెట్లు నాటాలని చెప్పారు. త్వరలోనే సీఎం మరోసారి ఔటర్పై ప్రయాణించి పచ్చదనం పరిశీలిస్తారన్నారు. సమీక్షలో హెచ్ఎండీఏ అధికారులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.