హైదరాబాద్ : మెట్రో రైలు ప్రారంభానికి పూర్తి సిద్ధంగా ఉన్నామని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సీఎస్ ఎస్పీ సింగ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28న మెట్రో రైలు ప్రారంభం ఉంటుందన్నారు. ప్రధాని మెట్రో రైలులో పర్యటిస్తారు. మరుసటి రోజు నుంచి మెట్రో రైలు కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. మొదటి ఆరు నెలలు తక్కువ సంఖ్యలో రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.