పార్లమెంటులో ప్రతిపక్షాల మధ్య ఐక్యత చాలా బాగుందని టిఎంసి సభ్యుడు డెరెక్ ఒ బ్రీన్ అన్నారు. ప్రతిపక్షాలే కాకుండా, ఎన్డిఎలోని శివసేనతో కూడా తమ సంబంధాలు బాగున్నాయని ఆయన చెప్పారు. ఇటీవలే టిఎంసి అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో రెండు గంటలపాటు సమావేశమై చర్చలు జరిపారని ఆయన చెప్పారు.