తెలంగాణ సచివాలయంలో సమన్వయకమిటీ భేటీ జరిగింది. ప్రధాని మోడీ, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 28న ప్రారంభంకానున్న మెట్రో రైలు రాష్ర్టానికి మణిహారంగా నిలుస్తుందని అన్నారు. మన మెట్రో రైలు దేశంలోనే అధునాతనమైనదని, ముంబై తరహాలో హైదరాబాద్ మెట్రోను అభివృద్ధి చేస్తామని అన్నారు. మెట్రో స్టేషన్ కు ఆర్టీసీ సర్వీసులు పెంచుతామన్న మంత్రి.. ఇవాంక పర్యటన సందర్భంగా భారీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.