హైదరాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద చేపడుతున్న నిర్మాణం పనులను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్యదర్శి నవీన్మిట్టల్, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. మెహదీపట్నం, పెన్షన్ ఆఫీస్, ఖాజాగూడ, ఓపెన్ యూనివర్సిటీ, బీహెచ్ఈఎల్ తదితర జంక్షన్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ తెలిపారు.