తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి కొద్ది సేపటిలో యాదాద్రికి చేరుకోనున్నారు. హెలికాప్టర్ ద్వారా యాదాద్రి కొండకు చేరుకున్న అనంతరం సీఎం 11.50 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం యాదాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. 2018 బ్రహ్మోత్సవాల సమయానికి ఆలయ పనులు పూర్తి చేయాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. పనులు మరింత వేగంగా జరగాల్సి ఉందని చెప్పిన కేసీఆర్ ఈ రోజు పర్యటనలో గర్భగుడి చుట్టూ ప్రధాన ఆలయ నిర్మాణం, క్యూ కాంప్లెక్స్, వసతి గృహాల నిర్మాణాలు, తాగునీలి సరఫరా, సుందరీకరణ పనులపై సమీక్షిస్తారు.