నాగ్పూర్: భారత్తో జరుగుతోన్న రెండో టెస్టులో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో తిరిమన్నె(9) బౌల్డయ్యాడు. దీంతో ఈ సిరీస్లో భారత స్పిన్నర్లకు తొలి వికెట్ దక్కినట్లైంది. ఈడెన్లో జరిగిన తొలి టెస్టులో స్పిన్నర్లకు ఒక్క వికెట్ కూడా దక్కని సంగతి తెలిసిందే.
25 ఓవర్లు ముగిసే సమయానికి లంక రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నే(20), మాథ్యూస్ ఉన్నారు.