సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా యాద్రాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగడి సునీత, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పర్యటన సందర్భంగా సీఎం కొండపై నిర్మాణమవుతున్న ముఖమండపం మొదటి అంతస్తులో కాకతీయ స్తంభాన్ని అమర్చే పనులను పూజలు చేసి ప్రారంభిస్తారు. స్వామి దర్శనం అనంతరం గుట్టపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. గర్భగుడి చుట్టూ ప్రధాన ఆలయ నిర్మాణంతోపాటు దానికి అనుబంధంగా ఉండే క్యూ కాంప్లెక్సులు, వసతి గృహాల నిర్మాణాలు, మంచినీటి సరఫరా వ్యవస్థ, సుందరీకరణ పనులపై అధికారులతో సమీక్షిస్తారు.