యాదాద్రిలో జరుగుతున్న టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు వివాహానికి సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు నూతన దంపతులకు పుష్పగుచ్చాలు ఇచ్చి ఆశీర్వచనం అందించారు. సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ సునీతమహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, కుచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్, మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చద కిషన్ రెడ్డి తదితరులు వివాహా వేడుకకు హాజరయ్యారు.