ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొరియా ద్వీపకల్పానికి అమెరికా యుద్ధ విమానాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 12:42 PM

ఉత్తర కొరియా, అమెరికా మధ్య గత పది నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో దక్షిణ కొరియా- అమెరికాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టనున్నాయి. ఇందు కోసం తొలిసారిగా అత్యంత శక్తివంతమైన ఎఫ్-22 యుద్ధ విమానాలను అమెరికా పంపనుంది. విజిలెంట్ ఏస్ పేరుతో జరిగే ఈ సైనిక విన్యాసాలు డిసెంబరు 4 నుంచి 8 వరకు జరగనున్నాయి. జపాన్‌ ద్వీపం ఒకైనవాలో ఉన్న ఆరు యుద్ధ విమానాలు దక్షిణకొరియాకు వస్తున్నట్లు ఆ దేశ మీడియా కథనాలను ప్రచురించాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి సైతం ధ్రువీకరించారు.


ఉత్తరకొరియా అణు క్షిపణీ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆదేశంపై ఒత్తిడిని మరింత పెంచే లక్ష్యంలో భాగంగానే అమెరికా, దక్షిణ కొరియా ఈ సైనిక విన్యాసాలను తలపెట్టాయి. అమెరికా ఇప్పటికే ఉత్తర కొరియా ప్రదేశిక జలాలకు సమీపంగా మూడు అణ్వాయుధ సామర్థ్యం గలిగిన మూడు యుద్ధ నౌకలను మొహరించింది. దశాబ్దం తర్వాత అమెరికా యుద్ధ నౌకలు మరోసారి ఉత్తర కొరియావైపు పయనించడం ఇదే తొలిసారి. దీంతో కొరియా ద్వీపకల్పంలో ఎప్పుడు ఏం జరగబోతుందోనని భయాందోళన వ్యక్తమవుతోంది. నిరంతరం అణ్వాయుధ, క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌ను నిలువరించడానికి అమెరికా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. మరోవైపు అమెరికా కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల జాబితాలో చేర్చింది.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com