ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అణుదాడికి సిద్ధమవుతున్నారంటూ కీలక రిపోర్టులు అందుతున్నాయి. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, గ్వామ్ దీవులే లక్ష్యంగా ఆయన దాడులు జరగనున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్న 15 ప్రాంతాలను కిమ్ సెలెక్ట్ చేశారని, ఈ ప్రాంతాలపై అణుదాడులు జరగవచ్చని యూరోపియన్ కమిషన్ ఆఫ్ పారిన్ రిలేషన్స్ (ఈయూఎఫ్ఆర్) తెలిపింది. ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థలో ఉన్న సోర్సెస్ ద్వారా ఈ సమాచారాన్ని సంపాదించగలిగామని వెల్లడించింది.
ఉత్తర కొరియా టార్గెట్ చేస్తున్నా ప్రాంతాలు ఇవే:
అమెరికాలోని న్యూయార్క్, మన్ హట్టన్, పెంటగాన్, వైట్ హౌస్ లతో పాటు ఇతర ముఖ్య ప్రాంతాలను,జపాన్ లోని టోక్యో, క్యోటో, ఒసాకా, మిసావా, మోకోహామా ప్రాంతాలను, దక్షిణ కొరియాలోని సియోల్, బుసాన్, గ్యాంనెయంగ్ ప్రాంతాలను మరియు గ్వామ్ దీవులను టార్గెట్ చేసారు