ముఖ్యమంత్రి కేసీఆర్ బాలాలయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులను వేదపండితులు ఆశీర్వదించారు. యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. స్వయంభు ఆలయం, ప్రధాన గోపురాలు, శివాలయం, మాఢ వీధులను పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగడి సునీత, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.