ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజాలపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 02:10 PM

మహబూబ్‌నగర్: ప్రజలు ఐక్యమై అధివృద్ధి నిరోధకుల ఆటలు కట్టించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలపూర్ గ్రామంలో నేడు డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ సభ్యులు పాల్గొన్నారు. లబ్దిదారుల సామూహిక గృహ ప్రవేశాల అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలకు ఇలాంటి ఆలోచన ఉండి ఉంటే ఇంకా ఇండ్లు లేనివారు ఉండేవారు కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కొందరికి కడుపు మండుతుందని.. కోర్టులకు వెళ్లి అభివృద్ధిని అడ్డుకుంటున్నరని దుయ్యబట్టారు. ఐక్యతే అభివృద్ధికి పునాదన్నారు. అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రతినిధిగా రాజకీయాల్లో ఇంతకంటే తృప్తి ఎక్కడా ఉండదన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com