హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశకు అటవీ శాఖ క్లియరెన్స్ లభించింది. ప్రాజెక్టు కోసం 3221 హెక్టార్ల అటవీ భూములను ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కు కేంద్రం నుంచి సమాచారం అందింది. కాశేళ్వరం ప్రాజెక్టు రెండో దశకు అనుమతులపై మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు కేసులతో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఇది చెంపపెట్టు వంటిదని ఆయన అన్నారు.