హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28న ఉదయం 3.30కి శంషాబాద్కు చేరుకోనున్నారు. ఇవాంక వెంట ప్రైవేట్ కమర్షియల్ ఫ్లైట్లో 100 మంది ప్రతినిధులు రానున్నారు. మాదాపూర్లోని వెస్టిన్ హోటల్లో ఆమె బస చేస్తారు. ఉదయం 9.30కి హెచ్ఐసిసిలో ప్రతినిధులతో ఇవాంక సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4.30కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి గ్లోబల్ సమ్మిట్లో ఆమె పాల్గొననున్నారు. సాయంత్రం 6.30కి ప్రధాని మోడీతో కలిసి ఫలక్నుమా ప్యాలెస్కు పయనమవుతారు. ప్యాలెస్లో డిన్నర్ తరువాత రాత్రి. 9.00కి వెస్టిన్ హోటల్కు ఇవాంక వెళ్తారు. 29వ తేదీ ఉదయం 9.30కి హెచ్ఐసిసి గ్లోబల్ సమ్మిట్లో పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రులతో ఇవాంక భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం గోల్కొండ కోటను సందర్శించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందులో ఇవాంక పాల్గొంటారు. సాయంత్రం 6గంటలకు హోటల్కు తిరుగు పయనమవుతారు. రాత్రి 9.30కి శంషాబాద్ నుంచి ఫ్లైట్లో ఇవాంక తిరిగి అమెరికాకు వెళ్లనున్నారు.