హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి. ప్రకాష్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అధికారికంగా సమాచారం అందజేసింది. కేంద్ర సుముఖతపై వి. ప్రకాష్ స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనేక కుట్రలు చేసిన్రు. ప్రాజెక్టులు నిర్మించడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఊహించిందేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తిగా అడ్డంకులు తొలగిపోయినయి. ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేరని ఆయన పేర్కొన్నారు.