ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అనుమతులు రావడం శుభపరిణామమని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 03:37 PM

కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అనుమతులు రావడం శుభపరిణామమని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మానసపుత్రికని.. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు అతి ముఖ్యమైనదన్నారు. ప్రాజెక్టు పూర్తితో 18 లక్షల ఆయకట్టు సాగులోకి వస్తదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు తమ హయాంలో రైతులకు సాగునీరు ఇవ్వలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్ ఎంతో పట్టుదలతో ఉన్నరని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రైతులు రుణపడి ఉంటారన్నారు. కోటి ఎకరాల మాగాణి నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నరని సుమన్ పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com