బాలీవుడ్ మూవీ పద్మావతి వివాదం రోజు రోజుకు ముదురుతుంది. ఇది కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా పక్క ప్రాంతాలలోను వైబ్రేషన్స్ కలిగిస్తుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి బీజేపీ ఎంపీ చింతామణి మాలవ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా కుటుంబాల్లో ఉండే ఆడవాళ్లు రోజుకో భర్తను మారుస్తారని, అలాంటి వాళ్లకు తన గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఆత్మబలిదానం చేసుకున్నవారి గురించి ఏం తెలుస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నిన్న సాయంత్రం ఓ ఛానెల్ డిబేట్ నిర్వహించగా బీజేపీ ఎమ్మేల్మే రాజా సింగ్ .. చింతామణి వ్యాఖ్యలని సమర్ధిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ, కత్తి మహేష్ వంటి సినీ ప్రముఖులు వెంటనే స్పందించి ఆయనకి తగిన కౌంటర్ ఇచ్చారు. ఇక మహేష్ బావ , ప్రముఖ టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తన ట్విట్టర్ లో రాజా సింగ్ .. నిన్ను చూసి సిగ్గుపడుతున్నా, మహిళలంటే నీకున్న అభిప్రాయం ఇదా. నీ ఇంట్లోని ఆడవాళ్లే నీపై ఉమ్మేయాలి అని ఘాటుగా స్పందించాడు.