రిటైల్ మార్కెట్లో టొమాటో ధరలు భగ్గుమంటున్నాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో టొమాటో ధర రూ.80కి చేరింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. బెంగళూరు మార్కెట్లో కిలో రూ.45-50 పలుకుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఐజ్వాల్, మిజోరాంలలో ఏకంగా రూ.100కు చేరింది. ‘ఇటీవల కురిసిన వర్షాలకు కర్ణాటక, మధ్యప్రదేశ్ల్లోని టొమాటో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో దిగుబడి తగ్గిపోయింది’ అని అజాద్పూర్ మండి టొమాటో మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ తెలిపారు. మధ్యప్రదేశ్లో 90శాతం మేర పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తర్వాతి కాపు చేతికి వచ్చే సరికి సుమారు 20 రోజులకు పైగా పడుతుందని రైతులు చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ అయిన అజాద్పూర్ మండిలో కిలో టొమాటో రూ.40-50 పలుకుతోంది. ఇక రిటైల్గా నాణ్యతను బట్టి రూ.70-80కు విక్రయిస్తున్నారు.