కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డకు వరప్రదాయిణిగా మారిన సంగతి తెలిసిందే. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామంలో శంకపెల్లి మానసకు వివాహం జరుగుతుండగానే పీటల పైనే 75,116 రూపాయల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కును ఎమ్మెల్యే రమేశ్ మానస తల్లిదండ్రులకు అందించారు. అనంతరం నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.