హైదరాబాద్ : టీఆర్టీ(టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్)ని 10 జిల్లాల ప్రకారమే నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.. టీఎస్పీఎస్సీ, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. 10 జిల్లాల ప్రాతిపదికనే నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. 31 జిల్లాల ప్రాతిపదికన టీఆర్టీని నిర్వహించాలని ఇటీవలే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం విదితమే.