ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని తొర్రూర్ మండలం మాటేడ్ శివారు ఏరియాలో జరిగింది. వేగంగా వెళ్తున్న కారు.. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.