ఓ క్యాబ్ అదుపుతప్పి ఎదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. గోపాలపురం ఎస్సై సతీష్ కథనం ప్రకారం ఆఘాపురాకు చెందిన నవీన్కుమార్(32), భాస్కర్యాదవ్(35) స్నేహితులు. వివిధ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 23న రాత్రి సికింద్రాబాద్లో తమ స్నేహితుడిని కలవడానికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో నవీన్కుమార్ ద్విచక్రవాహనం నడుపుతుండగా, భాస్కర్ వెనకాల కూర్చున్నాడు. చిలకలగూడ చౌరస్తా సమీపంలోకి చేరుకోగానే వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ క్యాబ్ అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ అక్కడికక్కడే మృతిచెందగా, భాస్కర్కు తీవ్రగాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు నవీన్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి, భాస్కర్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.