ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉసురు తీసిన క్యాబ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 25, 2017, 08:56 AM

 ఓ క్యాబ్‌ అదుపుతప్పి ఎదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. గోపాలపురం ఎస్సై సతీష్‌ కథనం ప్రకారం ఆఘాపురాకు చెందిన నవీన్‌కుమార్‌(32), భాస్కర్‌యాదవ్‌(35) స్నేహితులు. వివిధ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 23న రాత్రి సికింద్రాబాద్‌లో తమ స్నేహితుడిని కలవడానికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో నవీన్‌కుమార్‌ ద్విచక్రవాహనం నడుపుతుండగా, భాస్కర్‌ వెనకాల కూర్చున్నాడు. చిలకలగూడ చౌరస్తా సమీపంలోకి చేరుకోగానే వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ క్యాబ్‌ అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్‌ అక్కడికక్కడే మృతిచెందగా, భాస్కర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు నవీన్‌ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి, భాస్కర్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com