గుజరాత్: ఈ రోజు నుంచి గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ రోజు సౌరాష్ట్రలో 4 చోట్ల, ఎల్లుండి దక్షిణ గుజరాత్లో మరో నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి సభకు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 9న సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.