హైదరాబాద్లో రేపటి నుంచి గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ సదస్సు జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే జీఈఎస్ సదస్సుకు 150 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సులో 127 దేశాలకు చెందిన మహిళా ప్రతినిధులు పాల్గొననున్నారు. సదస్సులో దిగ్గజాలు విజయాలు, వినూత్న ఆలోచనలను పంచుకోనున్నారు. సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ చేరుకుంటున్నారు.