ముంబయి: దేశీయ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సెన్సెక్స్ 63 పాయింట్ల నష్టంతో ఉంది. 33,726.65 వద్ద ప్రారంభమైన సూచీ ఇంట్రాడేలో కనిష్ఠంగా 33,639.32ను తాకింది. 33,660.63 వద్ద కదలాడుతోంది. ఇక నిఫ్టీ 10,388.90 వద్ద ట్రేడవుతోంది. ఉదయం 10,387.90 వద్ద ప్రారంభమైన ఈ సూచీ ప్రస్తుతం 10 పాయింట్ల మేర పతనమైంది. సూచీలు క్రమంగా కోలుకుంటున్నాయి. కొనుగోళ్ల మద్దతు పెరుగుతోంది.