ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదిక అయ్యింది. ఈ సదస్సుకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ఇవాంకా ట్రంప్ లకు బహుమతులను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి కాకతీయ కళాతోరణం నమూనాను, ఇవాంకా ట్రంప్ కు చార్మినార్ నమూనానూ తెలంగాణ ప్రభుత్వం బహూకరించనుంది. అలాగే సదస్సులో ముగింపు ప్రసంగం చేయనున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు వీణ, సదస్సుకు విచ్చేయనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు నెమలి బహుకరించి వారిని సత్కరించనుంది.