ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లీ లాంటి ఆటగాడిని చూడలేదు : బిషన్‌ సింగ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2017, 02:15 PM

భారత క్రికెటర్లలో ఇప్పటి వరకు కోహ్లీ లాంటి ఆటగాడిని చూడలేదని మాజీ క్రికెటర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీల మైలురాయిని అందుకున్న విరాట్‌ కోహ్లీకి దిల్లీలో బుధవారం రాత్రి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బేడీ మాట్లాడుతూ.. ‘గత మూడునాలుగేళ్ల నుంచి విరాట్‌ కోహ్లీ గురించి ఎంతో విన్నాను. క్రికెట్‌తో పాటు జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కోహ్లీ ఎప్పటికీ ఇలాగే ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను మైదానంలో కోహ్లీలా దూకుడు ప్రదర్శించే ఆటగాడిని చూడలేదు’ అని అన్నారు.


‘భారత్‌ తరఫున ఆడాలంటే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయాలి. రంజీ ట్రోఫీ కోసం రంజీ ఆడుకోండి. దులీప్‌ ట్రోఫీ కోసం దులీప్‌ ఆడుకోండి. భారత జట్టులో స్థానం దక్కించుకోవాలంటే మాత్రం ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడాలి. రెడ్‌, బ్లూ, గ్రీన్‌ అని మన దేశంలో కొన్ని జట్ల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు’ అని బేడీ తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com