హైదరాబాద్: వచ్చే వారం నుంచి 'మన నగరం / ఆప్నా షెహర్' పేరుతో నగరంలో టౌన్ హాలు సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నగరంలో సర్కిళ్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు, ఎన్జీవోలతో నేరుగా చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజల ప్రాధాన్య అంశాలపై టౌన్హాలు వేదికగా చర్చిస్తామని కేటీఆర్ ట్వీట్ చేశారు. 'మన నగరం' పేరుతో పాటు అందులో చార్మినార్ ఉన్న లోగోలను మంత్రి ఈ సందర్భంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.