దమ్మపేట: భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని లింగాలపల్లికి చెందిన చాప కృష్ణ ప్రియాంక(19) అనే విద్యార్థిని సోమవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ప్రవీణ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కృష్ణ ప్రియాంక భద్రాచలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతోంది. రెండ్రోజుల క్రితం ఇంటికి వచ్చి ముభావంగా ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాలకు చెందిన ఓ అధ్యాపకుడి వేధింపులే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందనివిద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దమ్మపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.