ముంబయి : ఓ ప్రయాణికుడు తన రెండు పాదాలకు బంగారం బిస్కెట్లను అతికించుకుని వచ్చాడు. ఎయిర్పోర్టు సిబ్బంది ప్రయాణికులను తనిఖీలు చేయగా.. ఈ విషయం బయటపడింది. రెండు పాదాలకు ఆరు చొప్పున బంగారం బిస్కెట్లను అతికించుకుని గుర్తు పట్టకుండా షూ ధరించాడు ప్రయాణికుడు. ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.