హైదరాబాద్: గండిపేట సీబీఐటీ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సీబీఐటీ కాలేజీ యాజమాన్యం ఫీజులు భారీగా పెంచిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యంపై నిరసనతో వందలాది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వీరికి మద్దతుగా ఓయూ విద్యార్థిసంఘాల నాయకులు, విద్యార్థులు సీబీఐటీ కాలేజీకి వస్తున్నారు.