హైదరాబాద్ నగర పరిధిలోగల సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యంతో విద్యార్థులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 9వ తేదీన మరోసారి యాజమాన్యంతో భేటీ కానున్నారు విద్యార్థులు. కాగా, ఒక్కో విద్యార్థిపై రూ.86వేలు ఫీజులు పెంచుతూ సీ బీఐటీ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం నిర్ణయం తీసుకున్న విషం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీగా పెంచిన ఫీజులను రద్దు చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫీజును రూ.1.13 లక్షల నుంచి రూ.2లక్షలు ఒక్కో విద్యార్థి నుంచి వసూలు చేసింది. అయితే, కళాశాలలో విద్యార్థులకు సౌకర్యాలను మెరుగు పరిచేందుకే ఫీజును పెంచుతున్నట్లు యాజమాన్యం చెబుతోంది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే మేము ఫీజును పెంచామని సమర్దించుకుంది సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం.