హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నేడు ఐటీ, టీఎస్ఐఐసీ లిమిటెడ్, పరిశ్రమలశాఖ సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. భేటీ సందర్భంగా మంత్రి ఫార్మా సిటీ పనులు, మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు, టీ వర్క్స్తో పాటు ఇతర పనుల పురోభివృద్ధిపై మంత్రి అధికారులతో చర్చించారు.