గుజరాత్: గుజరాత్లో తొలి దశ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో చివరి రోజు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని పోటాపోటీగా నిర్వహించనున్నాయి. ప్రధాని మోడీ ఇవాళ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, విదేశాంగ మంత్రి సుషా ్మ స్వరాజ్, యోగి ఆదిత్యనాథ్, విజయ్ రూపాని కూడా పాల్గొననున్నారు. తొలి దశ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగియనుంది.