హైదరాబాద్ : జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ హైదరాబాద్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముస్తాబవుతోంది. కాలేజీ ఆవిర్భవించి 50 వసంతాలు ముగిసిన నేపథ్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల నిర్వాహణ కోసం వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కన్వీనర్గా, బ్రమరాంభ, మం గళగౌరీ, జి.ఎన్.శ్రీనివాస్, అల్యూమినీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుందర్ ప్రకాష్తో కలిపి ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులందరిని భాగస్తులను చేస్తూ వేడుకలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగోను వర్సిటీలో వైస్ చాన్స్లర్ ఎ.వేణుగోపాల్రెడ్డి, రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య, ప్రిన్సిపాల్ ఎ.గోవర్దన్లు ఆవిష్కరించి గోల్డెన్ జూబ్లీ వేడుకలకు శ్రీ కారం చుట్టగా ఈనెల 17న 3కె రన్తో గోల్డెన్ జూబ్లీ వేడు కలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 23న రీ యూనియన్ పేరుతో అల్యూమినీ అసోసియేషన్ నేతలతో ప్రత్యేక సమా వేశంతో పాటు మరో ఆరు నెలలపాటు వివిధ కార్యక్రమా లతో వేడుకలను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జూన్, జూలై మాసంలో మూడ్రోజులు ప్రత్యేక కార్యక్రమాలతో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా ముగించేలా కార్యక్ర మాలకు రూపకల్పన చేస్తున్నారు.