తమిళనాడు: రాష్ట్రంలోని తిరుచ్చి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ - టూరిస్టు వ్యానును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు కన్యాకుమారికి చెందిన ఒకే కుటుంబం వారిగా గుర్తించారు.