ప్రపంచ ఆర్థిక పారిశ్రామికవేత్తల సదస్సు (జిఇఎస్) సందర్భంగా తెలంగాణ పోలీసులు అందించిన సేవలకు కేంద్రం నుండి ప్రశంసలు లభించాయి. ఈ మేరకు బుధవారం నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి అమితాబ్ కాంత్ అధికారిక ప్రకటనను వెలువరించారు. హైదరాబాద్ నగరంలో జిఇఎస్ నిర్వహణ సందర్భంగా తెలంగాణ పోలీసులు క్లిష్ట పరిస్థితుల్లోను విజయవంతంగా విధులు నిర్వహిస్తూ తమ సేవలు ఉత్తమమని చాటుకున్నారని పేర్కొన్నారు.
ఈ సదస్సు నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు ముందస్తు ప్రణాళికతో కట్టుదిట్టంగా పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సదస్సుకు 150 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు శాంతి యుత వాతావరణంలో తమతమ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి పోలీసు యంత్రాం గం కృషి శ్లాఘనీయమని ప్రశంసా పత్రం లో పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రశంస లు ఆత్మస్థైర్యాని, విధినిర్వహణలో మ రింత బాధ్యతలను పెంచిందని డిజిపి ఎం.మహేందర్రెడ్డి తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రపోలీసులు శాంతి భద్రతలు కాపాడటంలో ముందుండడం గర్వకారణమన్నారు.