ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఐటీ కళాశాలలో ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 10:41 AM

హైదరాబాద్‌: సీబీఐటీ కళాశాలలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కళాశాల యాజమాన్యం భారీగా ఫీజులు పెంచినందుకు నిరసనగా నిన్నటి నుండి కళాశాల విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులకు పలు విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఇవాళ ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలలో ఆందోళన నిర్వహిస్తున్నారు. కళాశాల బస్సులను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అదేవిధంగా కళాశాలలోకి దూసుకెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. సీబీఐటీ కళాశాల ఆవరణలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com