పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్లో టీమిండియా ప్లేయర్స్ సందడి చేశారు. లంకతో మూడో టెస్ట్ ముగిసిన తర్వాత ఢిల్లీలో జరిగిన ఈ సెర్మనీకి కోహ్లితోపాటు పుజారా, ఇషాంత్శర్మ, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్లాంటి ప్లేయర్స్ కొత్త జంటతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత నెల 23న మీరట్లో పెళ్లి చేసుకున్న భువీ.. ఢిల్లీలో ప్రత్యేకంగా టీమిండియా, బీసీసీఐ పెద్దల కోసమే రిసెప్షన్ ఏర్పాటుచేశాడు. ఢిల్లీలోని తాజ్ హోటల్లో ఈ రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. ఇండియన్ ప్లేయర్స్తోపాటు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ కూడా ఈ రిసెప్షన్కు వచ్చాడు. పెళ్లి కారణంగా శ్రీలంకతో తొలి టెస్ట్ మాత్రమే ఆడి.. మిగతా రెండు టెస్టులకు భువీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు లంకతో వన్డే సిరీస్కు అతను మళ్లీ టీమ్తో చేరనున్నాడు.