తుపాకులగూడెం బ్యారేజీ నుంచి మేడిగడ్డ బ్యారేజీ వద్దకు సీఎం కేసీఆర్ బయల్దేరారు. తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. నిర్మాణ పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజి వద్దకు బయల్దేరారు. సీఎంతో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్రావు ఉన్నారు.